telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అచ్చెన్నకు అవినీతి మరక అంటించాలని ప్రయత్నం: లోకేశ్

Minister Lokesh comments YS Jagan

ఏపీ ఈఎస్‌ఐలో స్కామ్ జరిగిందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. బీసీ నిధులను తుగ్లక్ పక్కదారి పట్టించారని లేవనెట్టినందుకు అచ్చెన్నాయుడుపై అవినీతి మరక అంటించాలని ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఆరోపించారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, బీసీల పరిస్థితి పట్ల ప్రశ్నించాడని ఇప్పుడు బీసీ నాయకుడిపై పడ్డారని మండిపడ్డారు.

మందులు, వస్తువుల కొనుగోళ్లలో అచ్చెన్నాయుడు ఎలాంటి లేఖలు రాయలేదని ఆధారాలు ఉన్నా, లీక్ వార్తలతో ఏదో సాధించాలని దొంగ పేపర్, దొంగ చానల్ తాపత్రయపడుతున్నాయని విమర్శించారు.ఆ మీడియా అంత ఆరాటపడడంలో తప్పులేదని, ఎందుకంటే రూ.10 షేర్ రూ.1440కి అమ్ముడుపోయిందని వ్యాఖ్యానించారు. కానీ మిగతా వాళ్లు క్విడ్ ప్రోకో వార్తల ట్రాప్ లో పడితే ఉన్న విలువ పడిపోతుందని తెలిపారు.

Related posts