telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏలూరు అగ్నిప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం

*ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీలో ఆగ్ని ప్ర‌మాదం..
*ఆరుగురు కార్మికులు మృతి..
*ఫ్యాక్ట‌రీలో మృతి చెందిన‌ వారి కుటుంబాల‌కు సీఎం జ‌గ‌న్ 25ల‌క్ష‌లు ప‌రిహారం
*తీవ్ర గాయాలైన వారికి 5 ల‌క్ష‌లు..గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారం

ఏలూరు జిల్లాలోని పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయవల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఏలూరు, మసునూరు మండలం, అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మంటల్లోనే సజీవ దహనమయ్యారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

మరో 13 మందికి తీవ్రగాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమించటంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. మృతుల్లో నలుగురు బిహార్ వాసులు ఉన్నట్టుగా గుర్తించారు.

స‌మాచారం అందుకున్నఆగ్నిమాప‌క‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Related posts