telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీ తాత్కాలికంగా మూసివేస్తున్నాం..

పశ్చిమ గోదావరి జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం వద్ద ఉన్న ఫోరస్ కంపెనీని తాత్కాలికంగా మూసివేస్తున్నామని ఆ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రకటించారు. గురువారం నాడు ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అగ్నిప్రమాదం సంభవించిన పోరస్ కంపెనీని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు… ప్రస్తుతానికి పోరస్ కంపెనీని తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రకటించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నంత కాలం కంపెనీ వేతనం చెల్లించనుందని కలెక్టర్ తెలిపారు. హై ప్రెషర్ వల్లే కెమికల్ రియాక్షన్ జరిగి ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కలెక్టర్ తెలిపారు.

కంపెనీ నిబంధనలు ఏమైనా ఉల్లంఘించిందా..? ప్రమాదకర రసాయనాల వినియోగం ఏమైనా ఉందా..?’ అనే అంశాలపై విచారణ చేస్తున్నామన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో నలుగురు బీహ‌ర్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందినవారని క‌లెక్ట‌ర్‌ చెప్పారు.

 

Related posts