telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : ఢిల్లీ ని కట్టడి చేసిన ముంబై…

ఈరోజు ఐపీఎల్ 2020 లో దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకోవడంతి ఢిల్లీ ముందు బ్యాటింగ్ చేసింది. కానీ ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ని ముంబై కట్టడి చేసింది. ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (25) పరుగులే ఆ జట్టు తరపున చేసిన ఓ ఆటగాడు చేసిన అత్యధిక పరుగులు. బ్యాట్స్మెన్స్ ఎవరు రాణించకపోవడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఇక ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా మూడేసి వికెట్లు తీసుకోగా నాథన్ కౌల్టర్-నైలు, రాహుల్ చాహర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే ముంబై 111 పరుగులు చేయాలి. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానంలో ఉన్న ముంబై ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించగా.. ఢిల్లీ ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. కానీ ఇప్పుడు ఢిల్లీకి గెలిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts