సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ ఎట్టకేలకు లోక్సభలో క్షమాపణలు చెప్పారు. గురువారం స్పీకర్ స్థానంలో ఉన్న ఎంపీ రమాదేవిపై ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలపై అధికార పార్టీ బీజేపీతో సహా అన్ని పక్షాల నుంచి నిరసన వ్యక్తమైంది.
ఆజంఖాన్పై తగిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు సభలోనే డిమాండ్ చేస్తూ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆజంఖాన్తో పాటు ఎస్పీ ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా తనకు ఛాంబర్కు పిలిపించుకుని మాట్లాడారు. చర్చల అనంతరం లోక్సభలో ఇటీవల చేసిన వ్యాఖ్యల పట్ల తాను చింతిస్తున్నానంటూ ఆజంఖాన్ క్షమాపణలు చెప్పారు.
పుచ్చిపోయిన పన్నుకి సింగపూర్ వెళ్లమని ఎవరు చెప్పారు?: యనమలపై రోజా ట్వీట్