telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పుచ్చిపోయిన పన్నుకి సింగపూర్ వెళ్లమని ఎవరు చెప్పారు?: యనమలపై రోజా ట్వీట్

roja ycp mla

టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో రాజధాని కావాలని ఎవరు అడిగారని, విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని యనమల విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రోజా ఆయనపై సెటైర్లు వేశారు.

‘విశాఖలో రాజధాని కావాలని ఎవరు అడిగారు?’ అని యనమల అన్నారని.. ‘పుచ్చిపోయిన పన్నుకి సింగపూర్ వెళ్లమని ఎవరు చెప్పారు?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని రోజా ట్వీట్ చేశారు. కాగా, ఆమె ట్వీట్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘అంటే, అప్పుడు వాళ్లు దోచుకున్నారు, ఇప్పుడు మీరు దోచుకుంటున్నారు అని ప్రజలు వాపోతున్నారు.  

Related posts