telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా బారిన పడిన రాహుల్ గాంధీ…

Rahul gandhi congress

మన దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది రాజకీయనాకులు ఈ వైరస్ బారిన పడ్డారు. ఇక తాజాగా రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని..ఆ పరీక్షల్లో కోవిడ్-19 పాజిటివ్‌ గా తేలిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని రాహుల్ సూచించారు. దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతి రోజూ రెండున్నర లక్షల కేసులు వస్తున్న విషయం తెలిసిందే.

Related posts