telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సర్పంచ్ పదవికి అత్తా కోడళ్ల పోటీ…

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు అక్కడ మరో వింత ఘటన చోటుచేసుకుంది. అయితే అక్కడ మొదటి దశ ఎన్నికల ప్రచార సమయం కూడా ముగిసింది. ఈ సమయంలో శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. కొత్తూరు మండలం మాతల గ్రామం నుంచి కలమట కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లు పోటీ పడుతుండటం అందరి చూపు ఇప్పుడు మాతల గ్రామం పైనే ఉంది . పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట మోహనరావు సతీమణి కలమట వేణమ్మ టీడీపీ నుంచి , చిన్న కోడలు కలమట సుప్రియ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు . గతంలో నాలుగు సార్లు మాతల గ్రామానికి సర్పంచ్ గా కలమట వేణమ్మ గెలిచారు . ఐతే ఇప్పుడు ఆ కుటుంబం నుంచే స్వయానా కోడలే వేణమ్మ పై పోటీకి దిగడం ఆసక్తిగా మారింది . నేటితో ఎన్నికల ప్రచారం ముగియడంతో ఈ అత్తాకోడళ్లు హోరాహోరీగా ప్రచారం చేపట్టారు . 9వ తేదీ ఎన్నికల్లో ప్రజలు ఈ అత్తా కోడళ్లలో ఎవరిని సర్పంచ్ గా ఎన్నుకుంటారో  చూడాలి మరి. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.

Related posts