telugu navyamedia
సినిమా వార్తలు

రణు మొండల్ తో పాడడానికి సిద్ధం : కుమార్ సను

Ranu-Mondal

ముంబైకి చెందిన రణు మొండల్ రైల్వేస్టేషన్ లో లతా మంగేష్కర్ పాడిన “ఏక్ ప్యార్ కా నగ్మా” పాట వైరల్ అవడంతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయిన విషయం తెలిసిందే. అన్ని కుదిరితే ఆమెతో పాడేందుకు తాను సిద్దంగా ఉన్నానని ప్రముఖ గాయకుడు కుమార్ సను తెలిపారు. ఇప్పటికే రణు మొండల్ హిమేశ్ రేష్మియాతో కలిసి ఓ పాట పాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సింగర్ సినీ పరిశ్రమకు రావడం సంతోషంగా ఉందన్నారు గాయకుడు కుమార్ సను. రణు మొండల్ వృత్తికి న్యాయం చేయగలిగితే..ఆమెకు తగిన గుర్తింపు లభిస్తుంది. సరైన ఆఫర్ వస్తే నేను ఆమెతో కలిసి పాడేందుకు సిద్ధంగా ఉన్నానని కుమార్ సను అన్నారు. కోల్ కతాకు చెందిన కుమార్ సను అసలు పేరు కేదార్ నాథ్ భట్టాచార్య. ఆయన హిందీలో హిట్ పాటలను పాడటంతో పాటు బెంగాలీ పాటల్ని కూడా పాడాడు. ఆయన్ను మెలోడీ కింగ్ అని పిలుస్తారు.

Related posts