telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రామాల్లో క్వరంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి: భట్టి విక్రమార్క

Batti vikramarka

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా వైరస్ విజృంభిస్తుందని విక్రమార్క ఆరోపించారు. పట్టణాల నుంచి గ్రామాలకు కరోనా వైరస్ వ్యాప్తి జరిగిందని, ప్రజారోగ్యాన్ని ఇంతదారుణంగా గాలికివదిలేసిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. గ్రామాల్లో క్వరంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో దళితులపై దాడులు ఆగడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. దళిత వర్గానికి రాజ్యాంగ రక్షణ కరువు అయిందని విమర్శించారు. దళితులపై జరుగుతున్న దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేస్తే కనీసం స్పందన లేదని మండిపడ్డారు. దళితులపై జరుగుతున్న దాడులు గురించి గవర్నర్ కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

Related posts