telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుంది: కన్నా

Kanna laxminarayana

ఏపీ రాజధాని అమరావతిపై ప్రభుత్వం చెప్పే దానికి చేసే దానికి పొంతన లేదని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. తమ ప్రాంతంలో రాజధాని వస్తుందని మూడు పంటలు పండే పొలాలను రైతులు త్యాగం చేశారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక కొందరి కోసమే వైసీపీ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు.

ఇప్పటికే వేలాది కోట్లు రాజధాని నిర్మాణానికి వెచ్చించారని అన్నారు. రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని, రాజధాని అమరావతిలోనే ఉండాలని తాము భావిస్తున్నామని చెప్పారు. రాజధాని అంశం పై సీఎం జగన్ తన వైఖరిని స్పష్టం చేయాలని కన్నా డిమాండ్ చేశారు. త్వరలో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని కన్నా పేర్కొన్నారు.

Related posts