telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ అప్డేట్ : తమిళనాడుకు షెడ్యూల్ షిఫ్ట్

RRR

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయ‌స్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నిక‌ల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్ర‌మిది. అలియా భ‌ట్‌, సముద్ర ఖని, అజ‌య్ దేవ‌గణ్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ పాత్ర‌లో, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా న‌టిస్తున్నారు. జూలై 30, 2020న చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తుండ‌గా, ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు నిజ పాత్ర‌ల క‌ల్పిత క‌థాంశమే ఈ చిత్ర‌మని ఇది వ‌ర‌కే రాజ‌మౌళి తెలియ‌జేశారు. ఈ చిత్ర త‌దుప‌రి షెడ్యూల్ పూణేలో ప్లాన్ చేశారు. అక్క‌డ షూటింగ్‌కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న‌ప్పుడ‌ల్లా ఏదో ఒక ఆటంకం ఏర్ప‌డుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో రాజ‌మౌళి పూణేలో జ‌ర‌పాల్సిన షెడ్యూల్‌ని త‌మిళ‌నాడుకి షిఫ్ట్ చేశాడ‌ట‌. ఇప్ప‌టికే అక్క‌డ ప‌లు లొకేష‌న్స్ ఓకే చేశాడ‌ని, దాదాపు 35 రోజుల పాటు అక్క‌డ షూటింగ్‌ జ‌రిపేందుకు స‌న్నాహాలు కూడా చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. చ‌ర‌ణ్ – ఎన్టీఆర్‌పై కీల‌క స‌న్నివేశాల‌ని ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రిస్తార‌ట‌.

Related posts