telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా ఎఫెక్ట్ తో పుట్టినరోజు వేడుకను వాయిదా వేసుకున్న మోహన్ బాబు…!

Mohan-Babu

టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రతి యేటా మార్చి 19వ తేదీన తన జన్మదినోత్సవంతోపాటు శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవాన్ని కూడా జరుపుతుంటారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ భయాందోళనల కారణంగా వాటిని వాయిదా వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ ఒక దేశము నుంచి మరో దేశానికి గాలి కంటే వేగంగా ప్రయాణిస్తోందని, ప్రజలు గుంపులుగుంపులుగా ఉండడం మంచిది కాదని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలను ఆయన గుర్తు చేశారు. అందుకే ఈ సంవత్సరం మార్చి 19న జరగాల్సిన తన పుట్టినరోజు వేడుకలను, శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశామని తెలిపారు. తనకు అభినందనలు తెలియజేయడానికి ఎవరూ రావొద్దని, కరోనా వైరస్ ఈ భూమి నుంచి నిష్క్రమించే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని మోహన్ బాబు సూచించారు.

Related posts