రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. త్వరలో చివరి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభిస్తారు. డి. సురేశ్బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పలు హాలీవుడ్, బాలీవుడ్ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు పని చేస్తుండడం విశేషం. ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పోరాట సన్నివేశాలకు ‘ఉరీ: ద సర్జికల్ స్ర్టైక్’కు పనిచేసిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచెర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. సమ్మర్లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నందితా దాస్, ఈశ్వరీరావు, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి హాలీవుడ్కు చెందిన డానీ సాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపిస్తారు. డి. సురేష్బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ఫేమస్ నటి నందితా దాస్, ఈశ్వరీరావు, జరీనా వహాబ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ వేసవిలో ‘విరాటపర్వం’ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
మీకేం పోయేకాలం… బాహుబలి తరువాతే కదరా మీరిద్దరూ… హీరోలపై తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు