1998వ సంవత్సరంలో “హమ్ సాథ్ సాథ్ హై” సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్ఖాన్ తన తోటి నటులు సైఫ్ ఆలీఖాన్, సోనాలీబెంద్రే, టబు, నీలం కొఠారీ, దుష్యంత్ సింగ్ లతో కలిసి రెండు కృష్ణ జింకలను వేటాడి చంపారనే కేసు నమోదైన సంగతి తెలిసిందే. జోథ్పూర్ కోర్టు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్పూర్ కోర్టులో సల్మాన్ విచారణకు హాజరవ్వాల్సి ఉండగా… విచారణకి వచ్చే రోజు ఆయనని హతమారుస్తామని మెసేజ్లు రావడం సంచలనం రేపింది. దీనిపై సల్మాన్ పోలీసులని ఆశ్రయించగా, కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులని పట్టుకున్నారు. ఫేస్ బుక్లో గ్యారీ షూటర్ పేరిట సల్మాన్ ఖాన్ని చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. సల్మాన్ భారతీయ చట్టం నుండి తప్పించుకోలగడు కాని బిష్ణోయ్ సంఘం నుండి కాదని వారు హెచ్చరించారు. కాగా ఓ కారు దొంగతనం కేసులో లారెన్స్ బిష్నోయ్ అనే వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఫేస్బుక్ ద్వారా అతను సల్మాన్ ఖాన్కు బెదిరింపు సందేశం పంపినట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు ప్రశ్నించగా పబ్లిసిటీ కోసమే సల్మాన్ ఖాన్కు బూటకపు బెదిరింపు సందేశాన్ని పంపినట్లు అతను అంగీకరించాడు. ఈ బెదిరింపులో ప్రమేయమున్న మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు స్థానిక రౌడీ షీటర్ సోపు ముఠాకు చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు.
previous post