మోదీ సర్కారుకు ప్రజలే గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రైల్వేలను ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటాన్ని తీవ్రంగా ఖండించారు. పేద ప్రజల జీవన రేఖను ప్రభుత్వం దూరం చేస్తోందని ఘాటు విమర్శలు చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో ఓ పత్రిక వార్తను పోస్ట్ చేశారు.
పేదలకు ఉన్న ఒకే ఒక్క ప్రయాణ సాధనాన్ని, ఈ ప్రభుత్వం వారి నుంచి లాగేసుకుందని ఆక్షేపించారు. పేదలకు ఏది అవసరమంటే దాన్ని కేంద్రం తీసేసుకుంటోందని అన్నారు. భారతీయ రైల్వేలలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని తాము అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.
రాజధాని విషయంలో నేను మాట్లాడింది వరదల గురించే: బొత్స