telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

త్వరలో ద్వారంపూడి అగ్రకుల దూరహంకారం దెబ్బతినే రోజు: నాగబాబు

Nagababu

ద్వారంపూడి అగ్రకుల దూరహంకారం దెబ్బతినే రోజు త్వరలోనే వస్తుందని జనసేన నేత నాగబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని భానుగుడి సెంటర్‌లో జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి ఘటనపై ఆయన మండిపడ్డారు.

‘తప్పుడు మాటలు మాట్లాడిన వాడిని క్షమాపణ చెప్పమని అడగడానికి శాంతియుతంగా వెళ్లిన జనసైనికులను,  జనసేన మహిళ కార్యకర్తలను రాళ్లతో కొట్టించిన చంద్రశేఖర్ రెడ్డి కిరాయి గుండాలకి ఎదురు తిరిగి డేరింగ్‌గా పోరాడిన జనసేన మహిళ కార్యకర్తలకి నా హృదయ పూర్వక అభినందనలు’ అని ట్వీట్ చేశారు.

‘వైసీపీ గుండాలు చేసిన దాడులు సాక్ష్యాలు మా దగ్గర కూడా ఉన్నాయి. కానీ, పోలీస్ ఏక పక్షంగా ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. పార్టీలు అధికారంలో ఈ రోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు. కానీ ప్రజలను, న్యాయాన్ని రక్షించాల్సిన పోలీస్ ఇలా అధికారపక్షం వాళ్ల దుర్మార్గాన్ని రక్షించాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్?’ అని ప్రశ్నించారు. తప్పు చేసిన వాళ్లని వదిలేసి శాంతియుతంగా అడగడానికి వెళ్లిన మా జనసైనికుల మీద కేసులు పెట్టడం చాలా అన్యాయం. ఇప్పటికయినా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ తప్పుని సరిదిద్దుకోండి. వాళ్లు చేసిన దాడుల సాక్షాలు ఒక్కసారి చూడండి’ అని ట్వీట్లు చేశారు.

Related posts