telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఉజ్జయిని అమ్మవారికి బంగారు బోనం స‌మ‌ర్పించిన‌ ఎమ్మెల్సీ కవిత..

తెలంగాణ‌లో బోనాల పండుగ పురస్కరించుకుని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంగారు బోనం సమర్పించారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ నివాసం నుంచి ఆమె బంగారు బోనంతో ఆలయానికి చేరుకుని, అమ్మవారికి సమర్పించారు. 2 వేల మందితో భారీ ర్యాలీగా తరలివచ్చి మెుక్కులు చెల్లించారు.

MLC K Kavitha participates in 'Bonalu' festival at Mahakali temple

ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. దాదాపుగా రెండువందల ఏళ్ళ చరిత్రున్న అమ్మవారి ఆలయం ఇదని చెప్పారు. అమ్మవారి ఆషస్సులతోనే రెండు జంటనగరాల అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు.

అయితే గత రెండుమూడు రోజులనుండి విపరీతంగా కురుస్తున్న వర్షాలకు.. ఇబ్బందులకు గురవుతున్న ప్రజలంతా.. అమ్మవారి దయవల్ల సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు కవిత.

Related posts