telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

నవోదయ విద్యాలయాల్లో మరో 5వేల సీట్ల పెంపు

Extra Seats in Javahar Navodaya Schools

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో అదనంగా సీట్లను పెంచింది. నవోదయ స్కూళ్ల లో మరో 5 వేల సీట్లను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఉన్న సీట్ల సంఖ్య 46,600 నుంచి 51 వేలకు పెరిగింది. 2019-20 విద్యాసంవత్సరం నుంచి ఈ పెంపుదల అమలులోకి వస్తుందని ప్రకటించింది.

నవోదయ పాఠశాలల్లో ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు ప్రభుత్వం గురుకుల తరహా ఉచిత విద్యనందిస్తుంది. 2001లో దేశ వ్యాప్తంగా సుమారు 6లక్షల మంది నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు హజరుగా, ఆ సంఖ్య 2019 లో 31 లక్షలకు చేరింది.

Related posts