telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎస్సీల్లో మాదిగలే ఎక్కువగా నష్టపోయారు: ఎమ్మెల్యే రాజయ్య

Tatikonda rajaiah mla

ఎస్సీల్లో మాదిగలే ఎక్కువగా నష్టపోయారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. మాదిగ ప్రజాప్రతినిధులు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులందరికీ మూడెకరాల వ్యవసాయ భూమిని ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదనిఅన్నారు. కేవలం అర్హత కలిగిన దళితులకు మాత్రమే మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పారని తెలిపారు. ప్రస్తుతం భూముల రేట్లు పెరిగిపోయాయని చెప్పారు.

అర్హత కలిగిన ఒక్కో దళిత కుటుంబానికి రూ. 30 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరుదామని సూచించారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తాను తీసుకెళ్తానని చెప్పారు. మాదిగల్లోని ఉపకులాలకు అన్యాయం జరుగుతుంటే వారు పోరాటం చేయాలని చెప్పారు. మాదిగ ఉప కులానికి చెందిన కడియం శ్రీహరి 18 ఏళ్లు మంత్రిగా పని చేశారనే విషయాన్ని గుర్తు చేశారు.

Related posts