భారత్లో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామానాలను కూడా వణికిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 88,600 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,92,533కి చేరింది.
గత 24 గంటల సమయంలో 1,124 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 94,503కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 49,41,628 మంది కోలుకున్నారు. 9,56,402 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. దేశంలో నిన్నటి వరకు మొత్తం 7,12,57,836 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.
ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని చంద్రబాబు పారిపోయారు: మోత్కుపల్లి