తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అవార్డులు అందుకుంటోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ హోటల్లో సీఐఐ నిర్వహించిన ‘సీఎఫ్ వో కాంక్లెవ్ 2019’ కు హాజరైన హరీశ్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్టుబడులు ఆకర్షించేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కృషి చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారని ప్రశంసలు కురిపించారు.
తమప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అండగా ఉంటుందని చెప్పారు.ఆర్థిక రంగం మెరుగుపడేందుకు సీఎఫ్ వోలు, పారిశ్రామికవేత్తలు సూచనలివ్వాలని హరీశ్ రావు తెలిపారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్లకే బాగా తెలుస్తుందని అన్నారు. కంపెనీలో వారే కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో తన బాధ్యత కూడా సీఎఫ్ వోల లాంటిదేనని చెప్పారు. పరిశ్రమలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు తొలిసారి మేళాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.
తనను ఓడించేందుకు వంద కోట్లు: పవన్