హైదరాబాద్ ప్రగతిభవన్ లో తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమ ఘాటుగా స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో పనుల పురోగతిపై సమావేశంలో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నాలుగేళ్లలో పట్టిసీమ ద్వారా 44 వేల కోట్ల పంట పండిందని దేవినేని ఉమ పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర మీకేం అన్యాయం చేసిందని దేవినేని ఉమ నిలదీశారు. బహుదా-వంశధార నదుల అనుసంధానం పనులు ఆపేశారన్నారు. సమావేశంలో తోటపల్లి ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడలేకపోయారని నిలదీశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను ఎందుకు ఆపేశారని నిలదీశారు. ఆంధ్ర రైతాంగానికి జగన్ సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు.
నా బయోపిక్ పై నాకు ఆసక్తి లేదు: గవాస్కర్