telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధానిలో 40 వేల కోట్ల కుంభకోణం: మంత్రి బుగ్గన

Mla buggana,data leake

అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని అసెంబ్లీలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాజధానిలో 40 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. పయ్యావుల, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహనరావులకు భూములున్నాయని చెప్పారు. యనమల వియ్యంకుడికి తాడికొండలో భూములు ఉన్నాయని అన్నారు. విక్రమసింహ పేరుమీద పయ్యావుల భూమి కొనుగోలు చేశారని వివరించారు.

జీవీఎస్ ఆంజనేయులు భారీ మొత్తం భూములు కొనుగోలు చేశారని బుగ్గన తెలిపారు. 40 ఎకరాలకు పైగా భూములను జీవీఎస్ ఆంజనేయులు కొనుగోలు చేశారని అన్నారు. వేమూరి రవికుమార్ కుటుంబ సభ్యుల పేర్లపై భూములున్నాయని చెప్పారు. పరిటాల సునీత కుమారుడి పేరు మీద భూములున్నాయని తెలిపారు. ధరణికోటలో ఆమె కుటుంబ సభ్యులు భూములు కొన్నారని చెప్పారు.

Related posts