telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పంట బీమాను ప్రభుత్వమే భరిస్తుంది: మంత్రి బొత్స

minister bosta in vijayawada meeting

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్‌ను ఇవాళ మంత్రి బొత్స ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ పంట బీమాను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందన్నారు. వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పుల పాలు కాకూడదని వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు.

రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతుభరోసా అందిస్తామని చెప్పారు. సున్నా వడ్డీకే రైతుకు రుణం ఇవ్వడం రైతులకు పెద్ద ఊరట అని తెలిపారు. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.7లక్షల పరిహారం అందిస్తామన్నారు. రైతులు, కౌలు రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా కలెక్టర్లు వెంటనే స్పందించాలని సూచించారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

Related posts