ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల సభలో అదరగొట్టే స్టెప్స్తో డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న రాత్రి అసదుద్దీన్ ఔరంగాబాద్లోని పైథాన్గేట్ వద్ద జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం స్టేజీ దిగుతూ స్టెప్స్ వేశారు.
అనుకోకుండా జరిగిన ఈ పరిణామం కార్యకర్తల్లో ఫుల్జోష్ నింపింది. ఎంఐఎం పార్టీ సింబల్ అయిన పతంగిని గుర్తు చేసే విధంగా ఎంపీ ఓవైసీ స్టెప్పులేసినట్లు కొందరంటున్నారు. ఓవైసీ డ్యాన్స్ వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ షేర్ చేసింది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను, ఎంఐఎం పార్టీ 44 స్థానాల్లో తన అభ్యర్థులను బరిలో నిలిపింది.
ఆ విషయం అసంతృప్తి కలిగించింది : నీతి ఆయోగ్