telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ గవర్నర్ ను కలిసిన షరీఫ్

sharif mandali chairman

ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ రాష్ట్ర గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుద్టూ మండలి రద్దు చేస్తారంటూ వస్తున్న వార్తలపై తాను స్పందించబోనని స్పష్టం చేశారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో తనను దూషించడం అనేది సర్వసాధారణం అని తేలిగ్గా తీసుకున్నారు. అయితే తాను రూల్స్ కు విరుద్ధంగా ఎక్కడా వ్యవహరించలేదని తెలిపారు.

నియమ నిబంధనలకు లోబడే నిర్ణయాలు తీసుకున్నానని షరీఫ్ వెల్లడించారు. వైసీపీ సర్కారు వికేంద్రీకరణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టగా, దాన్ని మండలి చైర్మన్ హోదాలో తన విచక్షణాధికారం ఉపయోగించి షరీఫ్ సెలెక్ట్ కమిటీ ముందుకు పంపుతున్నట్టు ప్రకటించారు. దాంతో ఆయనపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Related posts