27 ఏళ్ళ క్రితం తెరకెక్కిన “సడక్” చిత్రానికి సీక్వెల్గా ఇప్పుడు “సడక్ 2” అనే చిత్రాన్ని మహేష్ భట్ తెరకెక్కిస్తున్నాడు . 2020లో మార్చి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్రంలో సంజయ్ దత్, పూజా భట్, ఆదిత్య రాయ్ కపూర్తో పాటు అలియాభట్ కూడా నటిస్తుంది. తొలి సారి తన తండ్రి దర్శకత్వంలో అలియా నటిస్తుంది. అయితే మహేష్ భట్ తాజాగా తన ఇద్దరు కూతుళ్ళు అలియా భట్, పూజా భట్లని ఒకే ఫ్రేములో బంధించిన ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశాడు. దీనికి సడక్ సెట్స్లో.. 40వ రోజు అని కామెంట్ పెట్టాడు. సడక్ 2 చిత్రాన్ని వికేష్ ఫిలింస్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
My daughters make my existence sparkle ! ( On the ‘sets’ of SADAK 2 day 40 ) pic.twitter.com/wD0T7Cy52V
— Mahesh Bhatt (@MaheshNBhatt) 18 October 2019
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ చివరిగా 1999లో కర్తూస్ అనే మూవీ చేశాడు. ఈ చిత్రం తర్వాత మళ్ళీ సడక్ 2 కోసం డైరెక్షన్ హ్యాట్ ధరించాడు. సంజయ్ దత్, పూజా భట్ ప్రధాన పాత్రలలో మహేష్ భట్ “సడక్” అనే చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 1991లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేసింది. వ్యభిచార ముఠా పూజా భట్ని బలవంతంగా ఎత్తుకెళ్ళి ఆమెను వ్యభిచారంలోకి దింపేందుకు ప్రయత్నించగా, టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్న సంజయ్ ఆమె ప్రేమలో పడి పూజాని అక్కడి నుండి తప్పిస్తాడు. వారి మధ్య జరిగిన ఆసక్తికర సన్నివేశాలతో “సడక్” చిత్రం రూపొందింది.
టిక్కెట్ రేట్లపై ప్రభుత్వానికి చెప్పాల్సింది చెప్పా..ఇకపై