డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కనిపించనుంది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు..
ఈ సినిమా తాజా షెడ్యూల్ అమెరికాలో మొదలైంది. మైక్ టైనస్, విజయ్పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఐరన్ మ్యాన్తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. “దిస్ మ్యాన్ ఈజ్ లవ్. ప్రతి క్షణాన్ని జ్ఞాపకాల్లా మార్చుకుంటాను. ఇదెప్పటికీ గుర్తుండిపోతుంది” అని క్యాప్షన్ రాశారు. ఈ ఫోటోలో విజయ్ – టైసన్ నవ్వులు చిందిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ షెడ్యూల్లో లైగర్ మూవీ క్లైమాక్స్ను షూట్ చేయనున్నట్టు సమాచారం. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేలా కనిపిస్తోంది.