శర్వానంద్ ప్రస్తుతం ‘శ్రీకారం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కిశోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో 29వ చిత్రమిది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. శర్వానంద్ ఇందులో పల్లెటూరి కుర్రాడిగా నటిస్తున్నారు. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. రావు రమేష్, ఆమని, సీనియర్ నరేష్, సాయికుమార్, మురళీ శర్మ, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె. మేయర్ అందిస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా ఆగిపోయింది. దీంతో ‘శ్రీకారం’ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో దించాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సంక్రాంతి బరిలో ఇప్పటికే అరడజను సినిమాలు రెడీగా ఉన్నాయి. దీంతో అన్ని సినిమాలతో పోటీ పడటం కంటే ‘వి’ బాటలో ఓటీటీ ద్వారా విడుదల చేస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. అక్టోబర్లో అనుష్క, రాజ్తరుణ్, సూర్య నటించిన మూడు సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి. అదే బాటలో ‘శ్రీకారం’ సినిమాను కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
previous post
ఇది నెక్ట్స్ లెవల్ సినిమా… ‘ఆర్ఆర్ఆర్”పై సాయిమాధవ్ బుర్రా