దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయస్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నికల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్రమిది. అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ పాత్రలో, రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బేనర్పై దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు నిజ పాత్రల కల్పిత కథాంశమే ఈ చిత్రమని ఇది వరకే రాజమౌళి తెలియజేశారు. ముందుగా చిత్రంలో ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గార్ జోన్స్ని ఎంచుకున్నాడు రాజమౌళి. కాని అనివార్య కారణాల వలన ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇటీవల అమెరికన్ నటి ఎమ్మా రోబర్ట్స్ని ఎన్టీఆర్ సరసన కథానాయికగా ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు చిత్ర బృందం. తాజా సమాచారం ప్రకారం మరో మారు బ్రిటిష్ నటినే కథానాయికగా ఎంపిక చేయాలని రాజమౌళి అండ్ టీం భావిస్తుందట. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్కి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం టీం బల్గేరియా వెళ్లేందుకు సిద్దమైంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30,2020న విడుదల చేయనున్నారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ లుక్ని అక్టోబర్ 22న విడుదల చేస్తారట. అందుకు కారణం ఆరోజు కొమురం భీమ్ పుట్టినరోజు అని టాక్ వినపడుతుంది. ఈ చిత్రంలో ఇంకా బాలీవుడ్కి చెందిన అజయ్ దేవగణ్, ఆలియాభట్లతో పాటు కోలీవుడ్కి చెందిన సముద్ర ఖని కూడా నటిస్తున్నారు.
previous post