telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మ‌నం విఫ‌ల‌మ‌వుతూనే ఉన్నాం… ప్రియాంక రెడ్డి హత్యపై మహేష్ ఫైర్

Sarileru NIkevvaru

ప్రియాంక హ‌త్యోదంతం… నిందితులని న‌డిరోడ్డు మీద ఉరితీయాల‌ని దేశవ్యాప్తంగా నినాదాలు చేస్తున్నారు. సెల‌బ్రిటీలు కూడా ఈ వివాదంపై గ‌ట్టిగా త‌మ వాద‌న వినిపిస్తున్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో ప్రియాంక రెడ్డి హ‌త్య‌పై స్పందించారు.

రోజు రోజుకు, నెల నెల‌కు, సంవ‌త్స‌ర సంవ‌త్స‌రానికి ..ఏం మారడం లేదు. స‌మాజంగా మ‌నం విఫ‌ల‌మ‌వుతూనే ఉన్నాం. రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాల‌కి నా ప్ర‌త్యేక విజ్ఞ‌ప్తి. మ‌న‌కు క‌ఠిన‌మైన చ‌ట్టాలు కావాలి, ఇలాంటి ఘోర‌మైన నేరాల‌కి మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని మ‌హేష్ కేటీఆర్, పీఎమ్ఓ ఇండియాల‌ని ట్యాగ్ చేశారు. అంతేకాక‌ ప్రియాంక‌ రెడ్డి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు మ‌హేష్‌. “మీకు జ‌రిగిన దారుణం ఎవ‌రు తీర్చ‌లేనిది. మ‌న‌దేశంలోని మ‌హిళ‌ల‌కి, యువ‌తుల‌కి న్యాయం చేయ‌డానికి అంద‌రం క‌లిసి న‌డుద్దాం.. భార‌త‌దేశాన్ని సుర‌క్షితంగా ఉంచుదాం” అని త‌న ట్వీట్ లో పేర్కొన్నారు మ‌హేష్‌.

Related posts