telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు..

*ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం

*గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో వైసీపీలో విషాద ఛాయలు నెలకొన్నాయి
*ఏపీ ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి  బుధవారం అంత్యక్రియలు..
*గౌతమ్‌రెడ్డి మృతికి రెండు రోజులు సంతాప దినాలుగా ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌

ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా క‌న్నుముశారు.మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకుంది. సోమవారం రాత్రి వరకు అక్కడే ఉంచి అనంతరం స్వగ్రామమైన నెల్లూరు జిల్లాలోని బ్రాహ్మణపల్లికి తరలించి, అభిమానుల సందర్శనార్థం రేపంతా అక్కడే ఉంచనున్నారు.

బుధవారం నాడు నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్‌రెడ్డి కుమారుడు అమెరికాలో చదువుతుండటంతో అతడు వచ్చాకే అంత్యక్రియలు జరపాలని కుటుంబీకులు నిర్ణయించినట్లు సమాచారం.

గౌత‌మ్ భౌతిక‌కాయాన్ని చూసి తండ్రి మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి గుండెలు విలిసేలా రోదిస్తున్నారు. ఆయ‌న్ను ఓదార్చ‌డం ఏవ‌రి వ‌ల్లా కావ‌డం లేదు.

మ‌రోవైపు…గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతికి సంతాపసూచకంగా..ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.

Related posts