telugu navyamedia
సినిమా వార్తలు

‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , ద‌గ్గుపాటి రాణా ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తోన్న తాజా సినిమా ‘భీమ్లానాయక్’. సాగర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన సాంగ్స్ యూట్యూబ్‌లో కొత్త రికార్డును సృష్టించాయి. ఈ సినిమా ఫిబ్రవరి 25న అని అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్ .దీంతో ప్రమోషన్స్ జోరు పెంచారు.

ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈవెంట్‌ఖి మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ల‌ను అతిథులుగా ఆహ్వానించారు.

అయితే ..ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా మరణించడంతో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ వాయిదా వేసింది. దీంతో పవన్ అభిమానులు ఒక్కసారిగా నిరాశపడిపోయారు. తరువాతైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా? ట్రైలర్ సంగతేంటి ? అంటూ ప్రశ్నిస్తున్నారు.

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ‘భీమ్లానాయక్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

Related posts