తెనాలి మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ చౌదరి మృతి చెందారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చౌదరి మృతితో ఆయన స్వస్థలం తెనాలిలో విషాదఛాయలు అలముకున్నాయి. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి తెనాలి తరలిస్తున్నారు.
రవీంద్రనాథ్ చౌదరి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆప్త మిత్రుడిగా గుర్తింపు పొందారు. ఇద్దరు కలిసి ఒకే కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన రవీంద్రనాథ్ చౌదరి తెనాలి మున్సిపల్ చైర్మన్ గా రెండు సార్లు, తెనాలి ఎమ్మెల్యేగా రెండు సార్లు విజయం సాధించారు.