telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మెగా డెయిరీ నిర్మాణానిక ప్రభుత్వం సన్నాహాలు: తలసాని

talasani srinivas yadav

250 కోట్ల వ్యయంతో మెగా డెయిరీ నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలుచేస్తోందని తెలంగాణ పశుసంవర్ద శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఈమేరకు మెగా డెయిరీ నుంచి మరిన్ని విజయా ఉత్పత్తులు ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. గురువారం రంగారెడ్డిజిల్లా మామిడిపల్లిలో మెగా డెయిరీ నిర్మాణం కోసం పశుసంవర్ధకశాఖకు చెందిన 32 ఎకరాల భూమిని విజయా డెయిరీకి 99సంవత్సరాలు లీజుకు ఇచ్చారు.

మంత్రి తలసాని సమక్షంలో పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి విజయా డెయిరీ ఎండి శ్రీనివాస్‌రావు ఒప్పందాల పై సంతకాలు చేశారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేయనున్న మెగా డెయిరీ నమూనాను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.

Related posts