telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

తల్లి అంత్యక్రియలకు అనుమతించాలని ట్వీట్.. తక్షణమే స్పందించిన కేటీఆర్

KTR TRS Telangana

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా రాష్ట్ర సరిహద్దులు దాటే పరిస్థితి లేదు. మహారాష్ట్రలోని ఓ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న తెలంగాణ వ్యక్తి తల్లి ఈరోజు ఉదయం హైదరాబాద్ లో చనిపోయింది. ఆమె చివరి చూపు దక్కించుకోవాలంటే తనకు తెలంగాణలోకి వచ్చేలా అనుమతించాలని కోరుతూ మంత్రి కేటీఆర్ కు ఆయన విజ్ఞప్తి చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో ఉన్న జనతా మహా విద్యాలయలో ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న తన పేరు డాక్టరు సుభాష్ అని ట్వీట్ లో కేటీ ఆర్ కు తెలిపారు. తన తల్లి కడసారి చూసేందుకు, ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తాను హైదరాబాద్ రావాల్సిన తప్పనిసరి పరిస్థితి నెలకొందని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్, సదరు డాక్టరు తల్లి మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆ డాక్టరుని రాష్ట్రంలోకి అనుమతించే విషయమై తన కార్యాలయ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Related posts