telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ గురించి రెండు మాటలు చెప్పక తప్పలేదు: సోమిరెడ్డి

somireddy chandramohan

ఏపీలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తమకు రాజకీయ ప్రత్యర్థి అయినా, ఆయన గురించి రెండు మాటలు చెప్పక తప్పడంలేదని అన్నారు. కేసీఆర్‌ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే పరిస్థితులను బట్టి సడలింపులు, పట్టువిడుపుల్లో ముందుంటారని తెలిపారు.

ప్రజల క్షేమం కోరుకునే ఏ నాయకుడికైనా ఈ లక్షణాలు ఉండాలన్నారు. పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుంటారని తెలిపారు. ‘నేను’, ‘నా వల్లే ఇదంతా జరగాలి’ అనుకునే ఇగోయిస్టులకు కేసీఆర్ తీరు కనువిప్పు కావాలని హితవు పలికారు. ప్రజా సంక్షేమం కోరుకునే వాళ్లు కేసీఆర్ ను చూసైనా నేర్చుకోవాలని హితవు పలికారు.

Related posts