telugu navyamedia
వార్తలు సామాజిక

సికింద్రాబాద్‌-మణుగూరు రైళ్లు రద్దు

train secunderabad

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. తాజాగా సికింద్రాబాద్ నుంచి కొత్తగూడెం, మణుగూరు వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. కొత్తగూడెం నుంచి ఆదివారం బయల్దేరనున్న సింగరేణి ఫాస్ట్‌ప్యాసింజర్‌ రద్దు చేశారు.

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌, రాత్రి సికింద్రాబాద్‌కు వెళ్లే మణుగూరు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, కాకతీయ ఫాస్ట్‌ ప్యాసింజర్‌తో పాటు రానున్న సింగరేణి ఫాస్ట్‌ప్యాసింజర్‌లను రైల్వేశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రద్దు చేశారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు మణుగూరు- సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ రైలు, మణుగూరు – కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Related posts