telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గాంధీలో వైద్యుల సంఖ్య పెంచాలి: జగ్గారెడ్డి డిమాండ్

jaggareddy in pcc race in telangana

తెలంగాణలో కరోనా వైరస్ విజృంబిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులకు సరిపడా సిబ్బంది లేరని ఆయన ఆరోపించారు. గాంధీలో వైద్యులు, స్టాఫ్ నర్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు.

గాంధీ ఆస్పత్రికి రూ.3 వేల కోట్లు వెంటనే కేటాయించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కరోనా వచ్చినా గాంధీకి రిఫర్ చేస్తున్నారని అన్నారు. గాంధీలో రోజుకు 30-50 మంది చనిపోతున్నట్లు తమను అనుమానంగా ఉందన్నారు. ఏం చేసినా ప్రశ్నించేవారు లేరని సీఎం కేసీఆర్‌కు నమ్మకంగా ఉందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Related posts