చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రత్యేక అతిథి హోదాలో మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు.
సాయంత్రం హైదరాబాద్లో ప్రత్యేక విమానంలో బయల్దేరి విజయవాడ చేరుకుంటారు. అక్కడ రాత్రి బస చేసి ఉదయం కార్యక్రమానికి హాజరవుతారు.
ఇదే వేదికపై మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణం చేయనున్నారు. అందుకోసం మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వెళ్తోంది.
నాల్గోసారి సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉదయం 11.27 నిమిషాలకు గన్నవరానికి సమీపంలో ఉన్న కేసరపల్లిలో ప్రమాణం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, ఇతర కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా హాజరుకానున్నారు.
వీళ్లతోపా వివిధ రంగాల ప్రముఖులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, క్రీడారంగ ప్రముఖులు రానున్నారు.