రాబోయే ఎన్నికల కోసం పవన్ తో అడుగులు వేస్తుందనుకున్న బహుజన సమాజ్ వాది పార్టీ అధినేత మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను లోక్సభ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ఆమె ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ప్రకటన చేసి సంచలనం రేపారు.
పార్టీని బలోపేతం చేసేందుకే ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నానని చెప్పారు మాయావతి. కూటమి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. తాను ఎప్పుడైనా, ఏ స్థానం నుంచైనా పోటీచేసే గెలవగలనని మాయావతి ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాయావతిని కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం జరిగిన అనంతరమే మాయావతి ఈ పోటీ నుండి విరమించుకున్నట్టు స్పష్టం చేయడం విశేషం.
ఈ నెల 18న 20 వేల మంది బీజేపీలో చేరుతారు: లక్ష్మణ్