telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రతి కుటుంబపై రూ.80 వేల పన్ను భారం: పంచుమర్తి అనురాధ

Anuradha Tdp

జగన్ ప్రభుత్వంపై పై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల కాలంలో ప్రజలపై భారం మోపుతున్నారని దుయ్యబట్టారు.

పెట్రోలు, డీజీల్ రేట్లు 3సార్లు పెంచి ప్రజలపై పన్ను భారం మోపుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.లక్షా 12వేల కోట్లు అప్పులు చేశారని అన్నారు. ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబపై రూ.80 వేల పన్ను భారం పడుతుందన్నారు.

ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసమే అమరావతి విషయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అమరావతి విషయంలో ఎమ్మెల్యే రోజా రోజుకో మాట మారుస్తున్నారు.

రాజధానిలో చంద్రబాబు కట్టించిన బిల్లింగ్స్‌ను గ్రాఫిక్స్ అంటున్న రోజా ధైర్యం ఉంటే ఆ బిల్డింగ్స్ పైనుంచి దూకి అది గ్రాఫిక్స్ అని నిరూపించాలని అన్నారు. ప్రశ్నించిన వారిని మానసికంగా, ఆర్థికంగా నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో వైసీపీ పాలన సాగుతోందన్నారు.

Related posts