పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ కాంగ్రెస్ నేత వీహెచ్ స్పందించారు. కేసీఆర్ పోతిరెడ్డిపాడును సీఎం జగన్కు అప్పగించారని వీహెచ్ ఆరోపించారు.
దీంతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతోందన్నారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని అన్నారు. కరోనా కట్టడిలో కేసీఆర్ ఉట్టి మాటలు చెబుతున్నారని ఎద్దేవాచేశారు. కేంద్రం నిధులు, దాతల విరాళాలకు లెక్కా పత్రం లేదని ఆరోపించారు. పేదలకు రూ.1500లు ఇచ్చారని, అయితే వైన్ షాపులు తెరిచి తిరిగి లాక్కున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్పుల తడక: మంత్రి అనిల్