మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో మావోల ఎరివేతకు అటవీ ప్రాంతంలో భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లాలో మావోయిస్టులకు పోలీసుకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగాయి. ఈరోజు మధ్యాహ్నం జిల్లాలోని పాల్వంచ రిజర్వు అటవీ ప్రాంతంలో జిల్లా పోలీస్ పార్టీలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.
కాల్పులకు పాల్పడ్డ మావోయిస్టులు పారిపోయినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. కాల్పుల అనంతరం ఆ ప్రదేశంలో తనిఖీలు నిర్వహించి తుపాకీ, కిట్ బ్యాగులు, సోలార్ ప్లేట్, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుసుకున్నారు. పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
పరీక్ష పేపర్ల లీకేజీ స్కామ్ పై విచారణ చేపట్టాలి: చంద్రబాబు డిమాండ్