telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఆ ప్రాంతాల్లో  4 గంటల వరకే పోలింగ్…

telangana reservations for panchayat
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ జరగనుంది.
మొత్తం 14 లక్షల 88 వేల 353 మంది ఓటర్లు ఉన్నారు. ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోని మూడు జిల్లాల్లో (ఆదిలాబాద్-నిర్మల్-కుంరంభీం) 2079 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1437 సర్వీస్ ఓటర్లు కాగా 253 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 74 మావోయిస్టు ప్రభావిత కేంద్రాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ జరగనుంది.  అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 7 మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో 9812 మంది సిబ్బంది ఉండగా 2300 పోలీసులు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. 
 

Related posts