‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఏపీ మినహా మిగిలిన ప్రాంతాల్లో విడుదలైన అన్ని వర్గాలకు సంబంధించిన అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికలపై ఈ చిత్రం ప్రభావం చూపిస్తుందని కొందరు కోర్టును ఆశ్రయించడంతో… ఇంత వరకు ఏపీలో ఈ చిత్రం విడుదల కాలేదు.
పోలింగ్ మరుసటి రోజైన 12వ తేదీన (రేపు) చిత్రాన్ని ఎలాగైనా విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్న సినిమా దర్శకనిర్మాతలు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఈరోజు ఈ చిత్రాన్ని ఏపీ హైకోర్టు ఛాంబర్ లో జడ్జిల కోసం ప్రదర్శించారు. సినిమాను చూసిన తర్వాత… తీర్పును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీనితో దర్శకనిర్మాతలు నిరాశకు గురయ్యారు.
విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వం వదులుకోవాలని టీడీపీ డిమాండ్!