పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పవన్ “పింక్” తెలుగు రీమేక్ “వకీల్ సాబ్”, క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. తాజాగా మరో మలయాళ రీమేక్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇఇవ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించనుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో విజయంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.ఇక తాజాగా ఈ చిత్రంపై మరో అంశం హాట్ టాపిక్ గా సాగుతుంది. ఈ చిత్రం తాలూకా ఒరిజినల్ వెర్షన్ లో పవన్ రోల్ కు గాను ఒక ఫిమేల్ లీడ్ ఉంటుంది అది కూడా చాలా తక్కువ నిడివితోనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ రోల్ సాయి పల్లవి చేస్తుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి మేకర్స్ ఈ చిత్రంలో ఆ రోల్ కు ఎవరిని ఓకే చేసారు అన్నది రివీల్ చెయ్యాల్సి ఉంది.
previous post
next post