telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణ హైకోర్టులో 25 మందికి కరోనా!

high court on new building in telangana

తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులతో పాటు పలు శాఖల సిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా హైకోర్టులో మొత్తం 50 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో సిబ్బందికి, సెక్యూరిటీ బలగాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా  25 మందికి పాజిటివ్ అని తేలింది.  కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని  ముఖ్యమైన కేసులు ఏవైనా ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారించాలని నిర్ణయించారు. 

 రాష్ట్రంలో కరోనా  వ్యాపిస్తున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై స్వయంగా రంగంలోకి దిగారు. ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్న తరుణంలో కరోనాపై గవర్నర్ సమీక్షలు చేపట్టారు. మరోవైపు కరోనా విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

Related posts