telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారీ రేటుకు “సర్కారు వారి పాట” రైట్స్

SVP

పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా త్వ‌ర‌లోనే యు.ఎస్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో ఈ మూవీ తెలుగు డిజిటల్ రైట్స్ సహా శాటిలైట్ హక్కులను భారీ ధరకు విక్రయించారని తెలిసింది.దీనికోసం 35 కోట్లు చెల్లించేందుకు ప్రముఖ సంస్థ సిద్ధమైందని తెలుస్తోంది. హిందీ సహా ఇతర భాషల శాటిలైట్ హక్కుల వ్యాపారం, అనువాద హక్కుల వ్యాపారం ఇంకా పెండింగులో ఉన్నాయని టాక్.

Related posts